విద్యుత్ సరఫరాకు అంతరాయం

NZB: రుద్రూర్ విద్యుత్ సబ్ స్టేషన్లో మరమ్మతుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఏడీఈ తోట రాజశేఖర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు త్రీఫేస్ విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఆయన చెప్పారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.