ఓట్ల లెక్కింపు సెంటర్లను పరిశీలించిన కలెక్టర్
MDCL: మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం మేడ్చల్ జిల్లా కలెక్టర్ మనూ చౌదరి సెంటర్లను పరిశీలించారు. అలియాబాద్ మున్సిపాలిటీ కోసం మజీద్పూర్లోని శ్రీ చైతన్య హై స్కూల్, మూడు చింతలపల్లి మున్సిపాలిటీకి జగన్గూడలోని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, ఎల్లంపేట్ మున్సిపాలిటీ కోసం బైబిల్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయని తెలిపారు.