లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం: చుక్కా రాములు

లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం: చుక్కా రాములు

SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది ఒక్క సీఐటీయు మాత్రమే అని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.