ఘనంగా రన్ ఫర్ జీసస్ ర్యాలీ
SRPT: యేసు ప్రభువువారి ఈస్టర్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ వి. యేసయ్య పాస్టర్ ఆర్గనైజేషన్తో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరత్నం బాబు హాజరై జండా ఊపి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు.