విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ.1.68 లక్షలు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శుక్రవారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ.1,68,424 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ రాజు తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 258 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 5 మంది దంపతులు లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొన్నారు అని, 3,841మంది అన్న ప్రసాదం స్వీకరించారని అన్నారు.