నర్సీపట్నం మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వసూళ్లు
AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో 2025-26 సంవత్సరంలో రూ.6.82 కోట్లు ఆస్తి పన్ను వసూళ్లు చేయాల్సి ఉండగా మార్చి 31వ తేదీ నాటికి రూ.5.82 కోట్లు వసూలు అయింది. రాష్ట్రంలో ఇంటి పన్నుల వసూళ్లలో నర్సీపట్నం మున్సిపాలిటీ 11వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుల బకాయిలకు సంబంధించి వడ్డీపై 50% రాయితీ ప్రకటించిన తర్వాత పలువురు చెల్లింపుకు ముందుకు వచ్చారు.