VIDEO: 'కూటమి ప్రభుత్వంపై న్యాయ పోరాటం'
VSP: కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే రూ.2.66 లక్షల కోట్ల అప్పు చేసి ప్రజలకు మేలు చేయలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. విశాఖ భూములపై, అమరావతి రియల్ ఎస్టేట్పై ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు.