సత్తెనపల్లి ఆసుపత్రిలో భద్రతా సిబ్బందికి యూనియన్ కార్డులు
PLD: సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిని ఏఐటీయూసీ నాయకులు అంజిరెడ్డి, కంబాల శ్రీనివాసరావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ పూదోట సందర్శించారు. కూటమి ప్రభుత్వం ప్యానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి రూ.18,600 జీతాలు ఆదేశించినా, కాంట్రాక్టు ఏజెన్సీలు తక్కువ మొత్తంలో మాత్రమే చెల్లిస్తూ దోపిడీ చేస్తున్నాయని వారు ఆరోపించారు.