నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారీయా తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరవుతారని, జిల్లా ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.