డిసెంబర్ 30 నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం డిసెంబర్ 30 నుంచి కల్పించనున్నట్లు టీటీడీ ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. ఈ మేరకు ఆఫ్లైన్, ఆన్లైన్ టోకెన్ల జారీ విధానాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో రూ.750 కోట్ల శ్రీవాణి ట్రస్టు నిధులతో 5 వేల భజన మందిరాలు నిర్మిస్తామన్నారు.