VIDEO: గోదావరి వరద ఉధృతి పరిశీలించిన ప్రత్యేక అధికారి

MLG: ఏటూరునాగారం మండలంలో గోదావరి, జంపన్నవాగుని సోమవారం ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి శశాంక పరిశీలించారు. దొడ్ల, మల్యాల గ్రామాల మధ్య జంపన్నవాగు పరిశీలించిన అనంతరం రామన్నగూడెం లోని పుష్కరఘాట్ వద్ద పెరుగుతున్న గోదావరినీ వరద ఉధృతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరదల వచ్చే ఇబ్బందులు, తీసుకునే నివారణ చర్యలను అడిగి తెలుసుకున్నారు.