పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి

నల్లగొండ: రేపటి నుండి జరగనున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాధికారి బొల్లారం బిక్షపతి శనివారం తెలిపారు. జిల్లాలో 19,302 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉందన్నారు. వీరికి 109 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని, రేపటినుండి ఏప్రిల్ 2 వరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.