జమ్ములమ్మను దర్శించుకున్న మున్సిపల్ ఛైర్పర్సన్
GDWL: జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామ స్వామి దేవాలయాన్ని నూతన గద్వాల మున్సిపల్ ఛైర్పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ఈవో పురందర కుమార్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి అమ్మవారి శేష వస్త్రాన్ని బహుకరించి ఘనంగా సన్మానించారు.