కంటైనర్, కారు ఢీ.. ఇద్దరు మృతి

TG: మేడ్చల్లోని కీసర పరిధిలో ఓఆర్ఆర్పై రోడ్డుప్రమాదం జరిగింది. కంటైనర్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరొకరికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతులు మేడిపల్లి, బోడుప్పల్కు చెందిన యశ్వంత్, ఛార్లెస్గా గుర్తించారు.