ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ఆటో

SKLM: పొందూరు మండలం గోరింట గ్రామ సమీపంలో శనివారం ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొన్న ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. పెనుబర్తి ఐఆర్ కాలనీకి చెందిన మడపాన రాజశేఖర్ ద్విచక్ర వాహనంపై గోరింట వైపు వెళుతుండగా పొందూరు నుంచి వస్తున్న ఆటో బలంగా ఢీకొంది దీంతో రాజశేఖర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు కాళ్లు చేతులు విరిగిపోయాయి.