ప్రభుత్వం, ప్రజలకు వారధిగా మీసేవ కేంద్రాలు: MRO
SDPT: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య మీసేవ కేంద్రాలు వారధిగా నిలుస్తున్నాయని సిద్దిపేట అర్బన్ తహశీల్దార్ రవికిరణ్ అన్నారు. మీసేవ సర్వీస్ ఛార్జీల పెంపు నేపథ్యంలో మంగళవారం ఆయన ఆపరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ఛార్జీలు పెంచడం జరిగిందని, దీనికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. నిర్దేశించిన ధరలకే సేవలు అందించాలని ఆపరేటర్లకు సూచించారు.