నేడు ఎంపీ పర్యటన వివరాలు
KDP: ఇవాళ శ్రీ రామనవమి పండుగ సందర్భంగా కడప జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ఆంజనేయస్వామి ఆలయం, 8 గంటలకు భాకరాపురం శ్రీ రామాలయం, 9 గంటలకు నగరి గుట్ట సీతారామాలయంలో పూజలు నిర్వహించనున్నారు.