రక్షణ గోడలు లేక.. రాకపోకలు కష్టంగా

రక్షణ గోడలు లేక.. రాకపోకలు కష్టంగా

PPM: కొత్తూరు గ్రామం సమీపంలోని నాగావళి కుడి కాలువపై ఉన్న వంతెన ప్రమాదకర స్థితికి చేరుకుంది. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 100 ఎకరాల సాగుకు ఉపయోగపడుతున్న ఈ కాలువ వద్ద నుంచి పొలాలకు వెళ్లడం, పశువులను మేతకు తీసుకెళ్లడం కష్టంగా మారిందన్నారు.