పేకాట స్థావరాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్

పేకాట స్థావరాలపై దాడి.. ఏడుగురు అరెస్ట్

వరంగల్ నగరంలోని చక్రజ్‌కుంట ప్రాంతంలో కుందూరు వెంకటరెడ్డి ఇంట్లో పేకాట జరుగుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.11,700 నగదు, ఆరు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు.