ఆశా కార్యకర్త సరస్వతమ్మ మృతి.!
NDL: చాగలమర్రి మండలం గొట్లూరు గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త వడ్ల సరస్వతమ్మ (59) గురువారం అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె 2006 నుంచి సేవలందిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండేవారు. సహచరులు గ్రామానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ.. ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.