హత్య కేసులో నిందితురాలి అరెస్టు...
HNK: హసన్ పర్తి మండలం సిద్దాపూర్కు చెందిన బాల్నే మొగిలిని హత్య కేసులో నిందితురాలైన ఆమె మరదలు వంగ ఇందిరను బుధవారం అరెస్టు చేసినట్లు సీఐ చేరాలు తెలిపారు. డబ్బుల విషయంలోని గొడవ కారణంగా నిందితురాలు బండరాయితో కొట్టి, కత్తితో పొడిచి అతన్ని హత్య చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు వంగ ఇందిరను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.