చిన్నారుల కాళ్లు కడిగిన సీఎం
శ్రీరామనవమి పురస్కరించుకుని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో ఘనంగా 'కన్యాపూజ' చేశారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి భోజనం వడ్డించారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సీఎం యోగికి యశస్విని అనే చిన్నారి 'బొమ్మ బుల్డోజర్'ను బహుమతిగా ఇచ్చింది.