తిరుపతిలో టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్

తిరుపతి: AP 3వ రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ను ఆదివారం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శాప్ ఛైర్మన్ రవి నాయుడు ప్రారంభించారు. దీనికి తిరుపతిలోని శ్రీనివాస కాంప్లెక్స్ వేదికగా నిలించింది. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు. MLAలు, రవినాయుడు సరదాగా టేబుల్ టెన్నిస్ ఆడారు.