VIDEO: వాడపల్లి వెంకన్న ఆలయంలో టెండర్ ప్రకటన
కోనసీమ: ఆత్రేయపురం(మం) వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో అధికారులు టెండర్లు ప్రకటించారు. దేవాలయానికి చెందిన కాళీ స్థలం నందు భక్తులు వాహనాలను క్రమ పద్దతిలో నిలిపి, వాటికి భద్రత కల్పించి దేవస్థానం నిర్ణయించిన రుసుము వసూలు చేసేందుకు టెండర్ కోరుతున్నట్లు ఈవో చక్రధరరావు తెలిపారు. ఈనెల 13న టెండర్లు తెరవబడతాయని పేర్కొన్నారు.