ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి బీసీ
NDL: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ, పింఛన్లు, ఉపాధి సంబంధిత సమస్యలను ప్రజలు ఆయన దృష్టికి తెచ్చారు. న్యాయబద్ధమైన వినతులపై మంత్రి తక్షణమే స్పందించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.