భారీ వర్షానికి నీట మునిగిన మధ్యాహ్న భోజన గది
ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి ప్రభుత్వ పాఠశాలలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పాఠశాలలోని మధ్యాహ్న భోజన గది పూర్తిగా నీటమునిగింది. దీంతో వంట సామాగ్రి తడిసిపోయి, భోజన తయారీకి అంతరాయం ఏర్పడింది. వేసవిలోనే ఈ పరిస్థితి ఉంటే, రానున్న వర్షాకాలంలో విద్యార్థుల పరిస్థితి ఏమిటని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు భోజన గదికి మరమ్మతులు చేపట్టాలన్నారు.