చిన్నారిపై దూసుకెళ్లిన లారీ
మంచిర్యాల జిల్లా నస్పూర్లోని సీతారాంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఎనిమిది నెలల పాప పైనుంచి లారీ దూసుకెళ్లింది. లారీ రివర్స్ చేస్తుండగా టైర్ కిందపడి చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.