మళ్లీ తెగిన కేఎస్ఐ కాల్వ
NGKL: వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామ శివారులో కేఎల్ఐది 82 కాలువకు మరోసారి గండి పడిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. పోతేపల్లి గ్రామ శివారులో కేఎస్ఐ కాలువ ద్వారా వస్తున్న నీటి ఉద్ధృతికి కాలువ తెగిపోయి నీరు వృథాగా పోతుంది. మండలంలో ప్రతి సంవత్సరం పలుమార్లు కేఎల్ఐ కాల్వకు గండి పడడం పరిపాటిగా మారిందని మండల వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.