జీవాల దాహార్తిని తీర్చండి: ఏడీకి వినతి
BPT: సంతమాగులూరు(M)లో గొర్రెలు, మేకల పెంపకం దారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్కి పెంపకం దారులు వినతి పత్రం అందజేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా జీవాలకు తాగునీరు, మేత కొరత తీవ్రంగా ఉందన్నారు. తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఏడీ సానుకూలంగా స్పందించినట్లు వారు పేర్కొన్నారు.