సలేశ్వరం అటవీ శాఖ కీలక సూచనలు
NGKL: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 'తెలంగాణ అమర్నాథ్' సలేశ్వరం జాతరపై ఫారెస్ట్ అధికారులు భక్తులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అడవిలో చెత్త వేయకూడదని, చెట్లు నరకరాదని సూచించారు. సిగ్నల్స్ ఉండవు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని, వెంట నీళ్ల బాటిల్స్, పండ్లు తెచ్చుకోవాలని కోరారు. అడవిని కాపాడటంలో భక్తులు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.