డోకిశీలలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం
PPM: గ్రామ స్థాయిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తూ ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్నామని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ టి. హేమాక్షి అన్నారు. ఈ మేరకు డోకిశీలలో మంగళవారం ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో పలువురికి ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు. అనంతరం రోగులకు మందులను పంపిణీ చేశారు