MBU వివాదం.. నలుగురు అరెస్ట్
TPT: విద్యార్థి నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) సిబ్బంది, బౌన్సర్లు దాడి, కిడ్నాప్ చేసిన కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా మధు, కిరణ్ కుమార్ రెడ్డి, హరికృష్ణ, కిషోర్ అనే మరో నలుగురిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.