'ఎండల నుంచి ఉపశమనానికి పకడ్బందీ చర్యలు'

'ఎండల నుంచి ఉపశమనానికి పకడ్బందీ చర్యలు'

కర్నూలు నగరంలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ ముందస్తు చర్యలు చేపట్టిన్నట్లు కమిషనర్ పీ. విశ్వనాథ్ ఇవాళ తెలిపారు. రూ. 56.65 లక్షలతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో 9 చలివేంద్రాలు, 8 చోట్ల షేడ్ నెట్‌లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తాగునీటి సరఫరా మెరుగుపరిచేందుకు అదనపు ట్యాంకర్లు వినియోగంలోకి తెచ్చినట్లు వెల్లడించారు.