రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన
MNCL: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా శ్రీరాంపూర్లో సోమవారం రూరల్ సీఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ పాల్గొన్నారు.