భక్తులతో పోటెత్తిన మోపిదేవి స్వామివారి ఆలయం

కృష్ణా: మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో స్వామివారి దర్శించుకుని, పూజలు నిర్వహించారు. తొలుత నాగవల్లి వృక్షం వద్ద ముడుపులు కట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు పర్యవేక్షించారు.