నియోజకవర్గ సమస్యలపై ఎంపీతో చర్చ
VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు కలిసి బొబ్బిలి నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. బొబ్బిలి రైల్వే స్టేషన్లో వృద్ధుల కోసం లిఫ్ట్, గున్నతోటవలస వద్ద అండర్పాస్ ఏర్పాటుపై ఎంపీకి విన్నవించారు. రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు.