జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా భార్గవ్ రావు నియామకం
SKLM: ముద్దాడ రేషన్ డిపో డీలర్ పగడ భాస్కరరావును జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమిస్తూ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. పౌరసరఫరాల శాఖ రేషన్ డిపోలో పారదర్శకతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయనకు సూచించారు. తనకు అప్పగించిన బాధ్యత సమర్థవంతంగా చేస్తానని భాస్కర్ రావు తెలిపారు.