ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో గురువారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,060గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,870గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే గురువారం సీసీఐ ధర రూ.50 తగ్గినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ. 90 పెరిగిందని వెల్లడించారు.