రెస్టారెంట్, హోటల్స్‌పై దాడులు

రెస్టారెంట్, హోటల్స్‌పై దాడులు

NLG: మిర్యాలగూడ పట్టణంలో సివిల్ సప్లై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. పట్టణంలోని మంజీరా బార్ అండ్ రెస్టారెంట్, హోటల్స్, కర్రీ పాయింట్‌ల‌పై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో సుమారు 36 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా సిలిండర్లు వినియోగిస్తున్న నిర్వాహకులపై 6ఏ కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.