చోరీలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 SKR నగర్ గ్రామంలో ఇవాళ రాత్రి చోరీలపై ఒంటిమిట్ట సీఐ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. CI మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చోరీల నియంత్రణ కొరకు CC కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామంలో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరిస్తే సమాచారం వెంటనే తెలపాలన్నారు. కొత్త వ్యక్తులకు గృహాలు అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.