అనంతపురం అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
అనంతపురం నగర అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్ కుమార్ నుంచి అన్ని శాఖల అధికారులతో కలిసి పెండింగ్ పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. నగరంలో చేపట్టవలసిన మౌలిక సదుపాయాల కల్పన, సుందరీకరణ పనులపై సుదీర్ఘంగా చర్చించారు.