ప్రజాదర్బార్ నిర్వహించనున్న ఎమ్మెల్యే
కోనసీమ: ఇవాళ అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు పర్యటన వివరాలు ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే ఆనందరావు క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహిస్తారు అని తెలిపారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.