రైతుపై ఎలుగుబంటి దాడి

రైతుపై ఎలుగుబంటి దాడి

TG: మెదక్ జిల్లా రామాయంపేట మండలం సదాశివ్‌నగర్ తండా వద్ద ఓ రైతుపై ఎలుగుబంటి దాడి చేసింది. పొలానికి వెళ్లిన హనుమంతు అనే రైతుపై ఎలుగుబంటి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానిక ప్రజలు వెంటనే గాయపడిన హనుమంతును రామాయంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అనంతరం ఎలుగుబంటి కోసం గాలిస్తున్నారు.