'ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం'

NDL: బనగానపల్లె పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం నాడు గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్వీకరించారు. అనంతరం అర్జీలను సమర్పించిన వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు.