28 పంచాయతీలకు ప్రత్యేక అధికారులు
AKP: ఎస్ రాయవరం మండలంలో 28 పంచాయతీలకు 8 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో మీనా కుమారి తెలిపారు. ఒక్కొక్కరికి మూడు నుంచి నాలుగు పంచాయతీలను కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక అధికారులుగా నియమించిన వారిలో తనతో పాటు తహసీల్దారు రమేష్ బాబు, ఇరిగేషన్ ఏఈ భాను, మండల పరిషత్ ఏవో రమేష్ బాబు, డిప్యూటీ తహసీల్దార్ నీరజను నియమించారు.