ఆలయాల్లో నిబంధనలు మార్పు
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాల్లో నిబంధనలను మార్పు చేశారు. అన్యమతస్థులు దర్శనానికి వచ్చిన వేళ కచ్చితంగా సనాతన ధర్మంపై విశ్వాసం ప్రకటిస్తూ అఫిడవిట్ ఇవ్వాలన్న నిబంధన అమల్లోకి వచ్చింది. నటి సారా అలీఖాన్ వచ్చినా ఈ నిబంధన పాటించాలని బద్రీ-కేథార్నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ హేమంత్ ద్వివేది స్పష్టం చేశారు.