నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ విద్యార్థులను సెకండ్ ఇయర్ విద్యార్థులు హాస్టల్లో వేధించినట్లు సమాచారం. గతంలో బాధితులు ఫిర్యాదు చేసినా, ప్రిన్సిపాల్ చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వెలువడ్డాయి. దీంతో సెకండ్ ఇయర్ విద్యార్థులు నవంబర్ 4న మళ్లీ ర్యాగింగ్కు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.