పెద్దేరు నీటి మట్టం వివరాలు

పెద్దేరు నీటి మట్టం వివరాలు

AKP: మాడుగుల మండలంలో పెద్దేరు జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో 300 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదిలిపెట్టినట్లు జలాశయం ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. దీని గరిష్ట స్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా ఇవాళ సాయంత్రానికి 136.40 మీటర్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. జలాశయంలోకి 125 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు పేర్కొన్నారు.