తిరుమల సమాచారం
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 63,539 మంది భక్తులు దర్శించుకోగా.. 23,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.