దూబచర్ల వాసులకు అలర్ట్

దూబచర్ల వాసులకు అలర్ట్

తూ.గో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో దూబచర్లలో ఆదివారం సెలవు రోజైనప్పటికీ ఇంటి పన్నుల వసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పంచాయతీ కార్యదర్శి ఆశా అలేఖ్య గ్రామంలో పర్యటిస్తూ పన్నులు వసూలు చేస్తున్నారు. పన్నులు చెల్లించని వారిపై చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. గ్రామ అభివృద్ధికి సహకరించేలా ప్రజలు సమయానికి పన్నులు చెల్లించి సహకరించాలని అలేఖ్య విజ్ఞప్తి చేశారు.